మస్కట్ నుంచి ఢిల్లీ, ముంబై, కొచ్చికి విమాన సర్వీసులు పునరుద్ధరించిన ఒమన్ ఎయిర్
- October 06, 2020
మస్కట్ నుంచి భారత్ కు విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు ఒమన్ ఎయిర్ ప్రకటించింది. ఢిల్లీ, ముంబై, కొచ్చి నగరాలకు వారంలో రెండు సర్వీసులను నడపనుంది. భారత్-ఒమన్ మధ్య బబుల్ అగ్రీమెంట్ కుదరటంతో భారత విమానయాన సంస్థలు కూడా ఒమన్ కు సర్వీసులను పున:ప్రారంభించిన విషయం తెలిసింది. ఆక్టోబర్ 7 నుంచి ఇండిగో సంస్థ విమాన సర్వీసులు అందుబాటులో రానుండగా...ఆ మరుసటి రోజు నుంచే ఒమన్ ఎయిర్ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో రానున్నాయి. అయితే..మస్కట్ నుంచి ఢిల్లీ, ముంబై, కొచ్చికి వారంలో రెండు సర్వీసులను మాత్రమే ఒమన్ ఎయిర్ నడపనుంది.
* మస్కట్ టూ ఢిల్లీ - ప్రతి వారంలో సోమవారం, బుధవారాల్లో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
*మస్కట్ టూ ముంబై - ప్రతి వారంలో ఆదివారం, గురువారాల్లో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
* మస్కట్ టూ కొచ్చి - ప్రతి వారంలో ఆదివారం, గురువారాల్లో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
అయితే..కోవిడ్ నేపథ్యంలో ప్రయాణికులు ఖచ్చితంగా ఆయా దేశాల ప్రభుత్వాలు విడుదల చేసిన మార్గనిర్దేశకాలను అనుసరించాలని అధికారులు తెలిపారు. ప్రతి ప్రయాణికుడు మాస్క్ ధరించటంతో పాటు..విమానం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. మస్కట్ రావాలనుకునే ప్రయాణికులు మరిన్ని వివరాల కోసం paca.gov.com, సందర్శించి తగిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని కోరారు. అలాగే భారత్ కు వెళ్లే ప్రయాణికులు omanair.com. వెబ్ సైట్ ద్వారా ప్రీ డిపార్చర్ వివరాలను తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు