అగర్వాల్ ఆర్ట్స్' చిత్రం ‘రాజ రాజ చోర’
- October 07, 2020
హైదరాబాద్:ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా, యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా, హసిత్ గోలి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాష్,సునయన నాయికలు.
ఈ చిత్రం షూటింగ్ నేడు పునః ప్రారంభమయింది. షూటింగ్ ప్రారంభించటానికి ముందు స్వర్గీయ ఎస్.పి. బాలు గారికి నివాళులు అర్పించిన అనంతరం ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమాలు పునః ప్రారంభించినట్లు తెలిపారు నిర్మాతలు. శ్రీవిష్ణు, హసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందుతున్న చిత్ర మిదని నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్ తెలిపారు. కథానాయకుడు శ్రీవిష్ణు, కాదంబరికిరణ్,శ్రీకాంత్ అయ్యంగార్ లు పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హౌస్ లో జరిగింది. ఈ చిత్రం ఈ రోజు నుంచి పూర్తయ్యేవరకు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది అని తెలిపారు సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల,క్రియేటివ్ ప్రొడ్యూసర్ కీర్తి చౌదరి.
చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో తనికెళ్ళ భరణి, రవిబాబు,కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్,వాసు ఇంటూరి తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వేదరామన్
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
స్టైలింగ్: శృతి కూరపాటి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కీర్తి చౌదరి
సహ నిర్మాత: వివేక్ కూచి భొట్ల
నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్
రచన-దర్శకత్వం: హసిత్ గోలి
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!