ఏపీలో కొత్తగా 5,292 కరోనా పాజిటివ్ కేసులు

- October 08, 2020 , by Maagulf
ఏపీలో కొత్తగా 5,292 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఏపీలో గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 5,292 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో 7,39,719కు కరోనా కేసులు చేరాయి.ఈ రోజు కరోనాతో 42 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా వల్ల 6,128 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 48,661 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 6,84,930 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 63.5 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు. 

కొత్తగా ప్రకాశం 6, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, నెల్లూరు, విశాఖలో నలుగురు చొప్పున మృతి చెందారు. గుంటూరు, కడప, కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, విజయనగరంలో కరోనాతో ఒకరు మృతి చెందారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com