ఆపద్బాంధవుడు కి 28 సంవత్సరాలు !!
- October 08, 2020
హైదరాబాద్:చిరంజీవికి ఉత్తమ నటుడిగా రెండో సారి నంది అవార్డు తీసుకొచ్చిన చిత్రమిది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు కొంచెంలో మిస్ అయ్యింది . అలాగే 5 నంది అవార్డులు గెలుచుకున్న చిత్రం . చిరు అభినయం ఇంటిల్లిపాదినీ కట్టిపడేసింది. ముఖ్యంగా మానసిక వికలాంగుడిగా చిరు ప్రదర్శించిన అభినయం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే శివుని పాత్రలో సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యినట్టు ఉంటుంది ఈ చిత్రంలోని చిరంజీవి పాత్ర . మీనాక్షి శేషాద్రి కథానాయకిగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు . అలాగే ఎం ఎం కీరవాణి అందించిన స్వరాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటాయి . కె.విశ్వనాథ్ - ఏడిద నాగేశ్వరరావు కలయికలో రూపొందిన ఆఖరు చిత్రం కూడా ఇదే. ఈ సినిమా తరువాత నిర్మాణానికి దూరమయ్యారు ఏడిద నాగేశ్వరరావు. అయితే నిర్మాతగా మాత్రం ఆయన్ని అన్ని విధాలా సంతృప్తిపరచిన చిత్రమిది. పూర్ణోదయ సంస్థ ప్రతిష్టని మరింత ఇనుమడింప చేసింది. జంధ్యాల తొలిసారి మేకప్ వేసుకొన్న చిత్రమిది. ఈ సినిమాకి సంభాషణలు అందించిన జంధ్యాల..ఇందులోని పరంధామరాజు పాత్రని ప్రేమించడం మొదలెట్టారు. చివరకి ఈ పాత్ర నేనే చేస్తా అని ఏడిద నాగేశ్వరరావుకి ఓ చీటి రాసిచ్చారు. చివరకి కె.విశ్వనాథ్ కూడా ఓకే అనడంతో తొలిసారి జంధ్యాల మేకప్ వేసుకొన్నారు. ఆయన నటించిన మొదటి & చివరి చిత్రం ఇదే .
తాజా వార్తలు
- కువైట్ లో పురుషులకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి..!!
- 36 కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసులను ప్రారంభించిన MOCI..!!
- సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!
- బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- యూఏఈలో రాబోయే మూడు సంవత్సరాలకు అకాడమిక్ క్యాలండర్ రిలీజ్..!!
- ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్









