కువైట్:కోవిడ్ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కమిటీ సమావేశం..నిర్ణయాలపై సర్వత్ర ఉత్కంఠ
- October 11, 2020
కువైట్ సిటీ:దేశంలో కోవిడ్ 19 మరణాలు, ఐసీయూలో కరోనా పేషెంట్ల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో..వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ఆరోగ్య శాఖ కమిటీ సమావేశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కమిటీ ఆదివారం సమావేశమై..సోమవారంగానీ, గురువారంగానీ తమ నిర్ణయం వెలువరించే అవకాశాలు ఉన్నాయి. అయితే..కరోనా తీవ్రత నేపథ్యంలో మరోసారి పాక్షిక కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో కమిటీ నిర్ణయం ఎలా ఉండబోతుందని ప్రజల్లో కొంత ఉత్కంఠ నెలకొంది. కానీ, ఈ ప్రచారాన్ని ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి కొట్టిపారేశారు. పలు నివేదికలు, సూచనలు, పరిస్థితుల ఆధారంగానే తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలాఉంటే..కువైట్ లో గత కొద్ది రోజులుగా కోవిడ్ మరణాల రేటు 11 శాతం పెరిగింది. ఇప్పటివరకు 655 మంది మరణించగా..ప్రస్తుతం యాక్టీవ్ కేసులో 139 మంది ఐసీయులో చికిత్స పొందుతున్నారు. వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెంచేలా ముందస్తు వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కుదిరితే ఈ వారంలోగానీ, లేదంటే ఎట్టిపరిస్థితుల్లో వచ్చే వారంలో వ్యాక్సినేషన్ చేపట్టాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
తాజా వార్తలు
- రాకేష్ బోద్ధులకు 'వంశీ విశ్వనాథ్ కళా తపస్వి’ జాతీయ పురస్కార ప్రదానం
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!









