కోవిడ్ నిబంధనల అమలు బాధ్యత లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్ ఫతా అల్ అలికి అప్పగింత
- October 13, 2020
కువైట్ సిటీ:కరోనాను నియంత్రించేందుకు కమిటీ నిర్దేశించిన మార్గనిర్దేశకాలను మరింత కఠినంగా అమలు చేయలనే దృఢనిశ్చయంతో ఉంది కువైట్ ప్రభుత్వం. కోవిడ్ నిబంధనలను సమర్ధవంతంగా అమలు చేసే బాధ్యతను రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్ ఫతా అల్ అలీకి అప్పగించింది. కోవిడ్ నియంత్రణ చర్యలను సమీక్షించేందుకు ప్రత్యేకంగా సమావేశమైన కువైట్ మంత్రి మండలి ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఇక నుంచి అబ్దుల్ ఫతా అల్ అలీ కోవిడ్ కమిటీని లీడ్ చేస్తారని, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలను అమలు చేస్తారని ప్రకటించింది. గతంలో కువైట్ ట్రాఫిక్ చీఫ్ గా విధులు నిర్వహించిన అబ్దుల్ ఫతా అలీ..దేశంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు అరికట్టడంలో సమర్ధవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వందల మంది ప్రవాసీయులపై కోర్టు ద్వారా దేశబహిష్కరణ శిక్షలు పడేలా విధులు నిర్వహించారు. ఇదిలాఉంటే..కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేసేందుకు ముసాయిదా చట్టాన్ని తీసుకురావాలని మంత్రిమండలి గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఫేస్ మాస్కులు ధరించపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకోవటం చట్టం లక్ష్యం.
తాజా వార్తలు
- మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’..తొలుత ఇచ్చేది వారికే!
- సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు
- గ్యాస్ లీకేజీల పై సౌదీ సివిల్ డిఫెన్స్ వార్న్..!!
- విశాఖలో ఇంటర్నేషనల్ మారిటైమ్ రివ్యూ.. పాల్గొన్న ఒమన్..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తి మృతి..తీర్పు వెల్లడి..!!
- ఇఫ్తార్ పై సోషల్ మీడియా వదంతులను ఖండించిన కువైట్..!!
- ఈద్ అల్ ఫితర్: GCC కంట్రీస్ టూర్లకు ప్రాధాన్యత ఎందుకు?
- ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మెసేజులపై ఖతార్ క్లారిటీ..!!
- T20 వరల్డ్ కప్ 2026: ఒమన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం
- టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం









