హైదరాబాద్ నుండి విజయవాడకు రాకపోకలు బంద్
- October 13, 2020
హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు రోజులుగా వర్షాలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్ శివారు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. శివారులో అతి భారీ వర్షం కురుస్తుండడంతో నగరం నుండి బయయకు వెళ్లే ప్రధాన రహదారుల్లో పెద్ద వాగుల్లా వరద ప్రవహిస్తోంది.
దీంతో నగరానికి వచ్చే వాహనదారులు , నగరం నుండి బయటకు వెళ్లే వాహనదారులు అనేక అవస్థలు పడుతున్నారు. చీకట్లో ఎటు వెళ్లలో తెలియక అవస్థలు పడుతున్నారు వాహనదారులు. అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఇనాంగూడ వద్ద విజయవాడ జాతీయ రహదారి పై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో కార్లు నీట మునిగాయి. దీంతో విజయవాడ నుండి హైదరాబాద్ కు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకి రావొద్దంటున్నారు అధికారులు. మరో రెండు రోజులపాటు జీహెచ్ఎంసీ పరిధిలో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!