శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం

- February 22, 2026 , by Maagulf
శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం

శ్రీశైలం: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తులకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. యాత్రికులు బస చేస్తున్న వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం సంభవించడం కలకలం రేపింది. అప్రమత్తమైన భక్తులు వెంటనే గది నుంచి బయటకు రావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

వివరాల ప్రకారం, కాటేజీలోని గదిలో అమర్చిన ఎయిర్ కండిషనర్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా పొగతో పాటు మంటలు చెలరేగాయి. గదిలో ఉన్న భక్తులు పరిస్థితిని గమనించి భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. వారి అరుపులు విని ఇతర గదుల్లో ఉన్న యాత్రికులు కూడా అప్రమత్తమై భవనం నుంచి బయటకు వచ్చారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై దేవస్థానం అధికారులు విచారణకు ఆదేశించగా, షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com