శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- February 22, 2026
శ్రీశైలం: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తులకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. యాత్రికులు బస చేస్తున్న వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం సంభవించడం కలకలం రేపింది. అప్రమత్తమైన భక్తులు వెంటనే గది నుంచి బయటకు రావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
వివరాల ప్రకారం, కాటేజీలోని గదిలో అమర్చిన ఎయిర్ కండిషనర్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా పొగతో పాటు మంటలు చెలరేగాయి. గదిలో ఉన్న భక్తులు పరిస్థితిని గమనించి భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. వారి అరుపులు విని ఇతర గదుల్లో ఉన్న యాత్రికులు కూడా అప్రమత్తమై భవనం నుంచి బయటకు వచ్చారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై దేవస్థానం అధికారులు విచారణకు ఆదేశించగా, షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









