మీ దగ్గర పాత నాణెం ఉంటే.. 25 లక్షలు మీవే..
- October 14, 2020
న్యూ ఢిల్లీ:నాణేలు సేకరించే హాబీ ఉంటే అవి ఇప్పుడు మీకు లక్షలు తెచ్చిపెడతాయి. అయితే ఒక షరతు.. ఆ నాణెం కనీసం వందేళ్ల నాటిది అయి ఉండాలి. పురాతన నాణేలను దేశంలో అతి పెద్ద ఆన్ లైన్ మార్కెట్ సంస్థ ఇండియామార్ట్ వేలం వేస్తుంటుంది. ఒకవేళ మీ వద్ద అలాంటి నాణెం ఉంటే దాన్ని వేలంలో ఉంచి లక్షల రూపాయలు గెలుచుకోవచ్చు. మీ దగ్గర 1913 నాటి రూపాయి నాణెం ఉంటే దాన్ని రూ.25 లక్షలకు వేలం వేయొచ్చు. వెండితో రూపొందిన విక్టోరియా కాలం నాటి ఈ నాణేల ధరను ఇండియామార్ట్ పై రూ.25 లక్షలుగా నిర్ణయించారు. 18వ శతాబ్ధం నాటి నాణెం ధరను రూ.10 లక్షలుగా నిర్ణయించగా, 1818లో ఈస్టిండియా కంపెనీ తయారు చేసిన నాణెం ఖరీదును ఇండియామార్ట్ పై రూ.10 లక్షలుగా ఖరారు చేశారు. ఈ అరుదైన పురాతన నాణెంపై హనుమాన్ ఫోటో ముద్రితమై ఉంటుంది. మీరు మీ దగ్గర ఉన్న నాణేలను విక్రయించదలిస్తే ఇండియా మార్ట్. కాంను సంప్రదించవచ్చు. ఈ వెబ్ సైట్ లో మీరు అకౌంట్ ఓపెన్ చేసి మీ పేరు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత మీ వద్దనున్న నాణేలను అప్ లోడ్ చేసి వాటిని సేల్ లో ఉంచవచ్చు. పురాతన నాణేలు సేకరించే వారు ఎంతైనా చెల్లించి కొనడానికి సిద్ధంగా ఉంటారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







