మీ దగ్గర పాత నాణెం ఉంటే.. 25 లక్షలు మీవే..
- October 14, 2020
న్యూ ఢిల్లీ:నాణేలు సేకరించే హాబీ ఉంటే అవి ఇప్పుడు మీకు లక్షలు తెచ్చిపెడతాయి. అయితే ఒక షరతు.. ఆ నాణెం కనీసం వందేళ్ల నాటిది అయి ఉండాలి. పురాతన నాణేలను దేశంలో అతి పెద్ద ఆన్ లైన్ మార్కెట్ సంస్థ ఇండియామార్ట్ వేలం వేస్తుంటుంది. ఒకవేళ మీ వద్ద అలాంటి నాణెం ఉంటే దాన్ని వేలంలో ఉంచి లక్షల రూపాయలు గెలుచుకోవచ్చు. మీ దగ్గర 1913 నాటి రూపాయి నాణెం ఉంటే దాన్ని రూ.25 లక్షలకు వేలం వేయొచ్చు. వెండితో రూపొందిన విక్టోరియా కాలం నాటి ఈ నాణేల ధరను ఇండియామార్ట్ పై రూ.25 లక్షలుగా నిర్ణయించారు. 18వ శతాబ్ధం నాటి నాణెం ధరను రూ.10 లక్షలుగా నిర్ణయించగా, 1818లో ఈస్టిండియా కంపెనీ తయారు చేసిన నాణెం ఖరీదును ఇండియామార్ట్ పై రూ.10 లక్షలుగా ఖరారు చేశారు. ఈ అరుదైన పురాతన నాణెంపై హనుమాన్ ఫోటో ముద్రితమై ఉంటుంది. మీరు మీ దగ్గర ఉన్న నాణేలను విక్రయించదలిస్తే ఇండియా మార్ట్. కాంను సంప్రదించవచ్చు. ఈ వెబ్ సైట్ లో మీరు అకౌంట్ ఓపెన్ చేసి మీ పేరు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత మీ వద్దనున్న నాణేలను అప్ లోడ్ చేసి వాటిని సేల్ లో ఉంచవచ్చు. పురాతన నాణేలు సేకరించే వారు ఎంతైనా చెల్లించి కొనడానికి సిద్ధంగా ఉంటారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







