క్వారంటైన్ గడువు సమయంలోనూ దేశం విడిచి వెళ్లేందుకు కువైట్ అనుమతి
- October 18, 2020కువైట్ సిటీ:కువైట్ చేరుకునే ప్రయాణికులు, ప్రవాసీయులకు సంబంధించి క్వారంటైన్ నిబంధనల్లో స్వల్ప సవరణలు చేసింది కువైట్ ప్రభుత్వం. కువైట్ ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గనిర్దేశకాల మేరకు సుల్తానేట్ కు చేరుకునే ప్రయాణికులు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంది. అయితే..సదరు ప్రయాణికుడు తాను తిరిగి తన దేశం వెళ్లాలని అనుకుంటే..వారు క్వారంటైన్ గడువు సమయంలోనూ నిరభ్యంతరంగా దేశం విడిచి వెళ్లొచ్చని తెలిపింది. దేశం విడిచి వెళ్లే ప్రయాణికుల విషయంలో ఎయిర్ పోర్టు అధికారులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పొద్దని కూడా సూచించింది. అయితే..కోవిడ్ లక్షణాలు ఉంటే మాత్రం ప్రయాణానికి అనుమతించరు. ఇదిలాఉంటే..కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న 34 దేశాల నుంచి విమాన ప్రయాణాలపై విధించిన నిషేధం యధావిధిగా కొనసాగుతుంది.
--దివాకర్(మాగాల్ఫా ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు