బహ్రెయిన్:ఏటీఎం కార్డులను చోరీ చేసి డబ్బు దోచుకున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్
- October 19, 2020
మనామా:ఏటీఎం కార్డులను చోరీ చేసి ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ముగ్గురు తాము దొంగిలించిన ఏటీఎం కార్డుల విదేశాల్లో ఉన్న నాలుగో నిందితుడికి చేరవేసి..అతని ద్వారా అక్రమంగా డబ్బు బదిలీ చేసుకున్నారు. అయితే..బాధిత కంపెనీల్లో ఒక కంపెనీ కార్డుల ద్వారా అనుమానస్పద లావాదేవీలను గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. ఎలక్ట్రానిక్ కార్డుల ద్వారా కింగ్డమ్ వెలుపల లావాదేవీలు జరిగాయని, దీనిపై తమకు సందేహాలు ఉన్నాయని తమ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో విచారణ చేపట్టిన అవినీతి నిరోధక శాఖ, ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ విభాగం అధికారులు ఎలక్ట్రానిక్ కార్డుల ద్వారా చోరీ జరిగినట్లు గుర్తించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు అంతా అరబ్ దేశస్తులేనని వెల్లడించారు. ఇక కింగ్డమ్ వెలుపల ఉన్న నాలుగో నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు బహ్రెయిన్ అధికారులు ఇంటర్ పోల్ సహాయాన్ని కోరారు.
తాజా వార్తలు
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్
- దుబాయ్ ఇ-స్కూటర్ రూల్స్: జోన్లు, జరిమానాల పై ఆర్టీఏ క్లారిటీ..!!
- అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలో మెరిసిన ఒమన్..!!
- హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం..ప్రపంచ వాణిజ్యానికి ముప్పు..!!
- కువైట్ లో ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకీకరణ..!!
- మక్కా, మదీనాలో 23వేలకు పైగా తనిఖీలు..!!
- చూపు లేకుండా శిశువు జననం..తల్లికి రూ.కోటి పరిహారం









