బహ్రెయిన్:ఏటీఎం కార్డులను చోరీ చేసి డబ్బు దోచుకున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్
- October 19, 2020
మనామా:ఏటీఎం కార్డులను చోరీ చేసి ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ముగ్గురు తాము దొంగిలించిన ఏటీఎం కార్డుల విదేశాల్లో ఉన్న నాలుగో నిందితుడికి చేరవేసి..అతని ద్వారా అక్రమంగా డబ్బు బదిలీ చేసుకున్నారు. అయితే..బాధిత కంపెనీల్లో ఒక కంపెనీ కార్డుల ద్వారా అనుమానస్పద లావాదేవీలను గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. ఎలక్ట్రానిక్ కార్డుల ద్వారా కింగ్డమ్ వెలుపల లావాదేవీలు జరిగాయని, దీనిపై తమకు సందేహాలు ఉన్నాయని తమ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో విచారణ చేపట్టిన అవినీతి నిరోధక శాఖ, ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ విభాగం అధికారులు ఎలక్ట్రానిక్ కార్డుల ద్వారా చోరీ జరిగినట్లు గుర్తించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు అంతా అరబ్ దేశస్తులేనని వెల్లడించారు. ఇక కింగ్డమ్ వెలుపల ఉన్న నాలుగో నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు బహ్రెయిన్ అధికారులు ఇంటర్ పోల్ సహాయాన్ని కోరారు.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







