పబ్లిక్ సెక్టార్ ఉద్యోగాల్లో ప్రవాసీయులను అనుమతించేది లేదని కువైట్ స్పష్టీకరణ
- October 19, 2020
కువైట్ సిటీ:ప్రభుత్వ రంగంలోని ఏ విధమైనా ఉద్యోగాలను ప్రవాసీయులతో భర్తీ చేసే ప్రసక్తే లేదని కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ తేల్చి చెప్పింది. అంతేకాదు..కాంట్రాక్ట్ ప్రాతిపాదికన ప్రవాసీయుల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వ సంస్థల నుంచి ఎలాంటి సిఫార్సులు వచ్చినా మరో ఆలోచన లేకుండా తిరస్కరిస్తామని కూడా స్పష్టత ఇచ్చింది. ప్రవాసీయులను సెకండ్ కాంట్రాక్ట్ నుంచి మెయిన్ కాంట్రాక్ట్ లోకి భర్తీ చేసుకునేలా అవకాశం కల్పించాలంటూ కువైట్ మున్సిపాలిటీ..సివిల్ సర్వీస్ కమిషన్ ను కోరిన నేపథ్యంలో సీఎస్సీ ఈ మేరకు ప్రకటించింది. ఇకపై ప్రభుత్వ రంగంలోని కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ప్రవాసీయులను భర్తీ చేయాలన్న ప్రతిపాదనలను అంగీకరించబోమని తెలిపింది. ఇటీవలె కువైట్ సహాకార సంఘాల్ల ద్వారా పంపిణీ చేసే సబ్సిడీ అహార పదార్ధాలకు సంబంధించి అవకతవకలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రజలకు అందాల్సిన సబ్సిడీ అహార పదార్ధాలు కువైట్ దాటి గల్ఫ్ లోని ఇతర దేశాలకు చేరానట్లు అరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కువైట్ సహాకర సంఘాల్లో విధులు నిర్వహించే 52 మంది అకౌంటెంట్ల హస్తం ఉందని కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రంగంలోని కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ప్రవాసీయుల స్థానంలో కువైటీయులు, కువైట్ మహిళల పిల్లలు, కువైట్ సంచార జాతీయులను భర్తీ చేయాలని గత వారమే ఎంపీలు అందరూ వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరింది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రభుత్వ రంగంలో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన ప్రవాసీయులకు అవకాశం కల్పించబోమంటూ సీఎస్సీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







