నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ..
- October 20, 2020ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం 6 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ఈ ప్రసంగానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియదు. మార్చిలో లాక్డౌన్ విధించిన నాటి నుంచి పలు మార్లు ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన విషయం తెలిసిందే. దేశ ప్రజలకు తానో విషయం చెప్పనున్నట్లు ప్రధాని మోదీ తన ట్వీట్లో వెల్లడించారు. అయితే ఆ ప్రసంగాన్ని అందరూ ఆలకించాలన్నారు. ఏ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడుతారో దాని గురించి ఆ ట్వీట్లో వెల్లడించలేదు. కానీ కరోనా గురించి ఇటీవల పలుసార్లు మోదీ ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే గత మూడు నెలల నుంచి తొలిసారి ఇవాళ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల లోపు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ ఉదయం తన ట్వీట్లో ఈ విషయాన్ని చెప్పింది.
आज शाम 6 बजे राष्ट्र के नाम संदेश दूंगा। आप जरूर जुड़ें।
— Narendra Modi (@narendramodi) October 20, 2020
Will be sharing a message with my fellow citizens at 6 PM this evening.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్