నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ..

- October 20, 2020 , by Maagulf
నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ..

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం 6 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ఈ ప్రసంగానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియదు. మార్చిలో లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి పలు మార్లు ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన విషయం తెలిసిందే. దేశ ప్రజలకు తానో విషయం చెప్పనున్నట్లు ప్రధాని మోదీ తన ట్వీట్‌లో వెల్లడించారు. అయితే ఆ ప్రసంగాన్ని అందరూ ఆలకించాలన్నారు. ఏ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడుతారో దాని గురించి ఆ ట్వీట్‌లో వెల్లడించలేదు. కానీ కరోనా గురించి ఇటీవల పలుసార్లు మోదీ ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే గత మూడు నెలల నుంచి తొలిసారి ఇవాళ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల లోపు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ ఉదయం తన ట్వీట్‌లో ఈ విషయాన్ని చెప్పింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com