బహ్రెయిన్, కువైట్‌ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ

- July 08, 2026 , by Maagulf
బహ్రెయిన్, కువైట్‌ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ

రియాద్: బహ్రెయిన్ , కువైట్ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడులను గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) ప్రధాన కార్యదర్శి జాసెమ్ మొహమ్మద్ అల్‌బుదైవీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో శాంతి, భద్రత, సంక్షోభ పరిష్కారానికి జరుగుతున్న ప్రయత్నాలను బలహీనపరిచే ఇరాన్ వైఖరికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

అల్‌బుదైవీ మాట్లాడుతూ, బహ్రెయిన్, కువైట్‌లపై జరిగిన ఈ దాడులు రెండు దేశాల సార్వభౌమాధికారంపై ప్రత్యక్ష దాడిగా, అంతర్జాతీయ చట్టాలు మరియు ఐక్యరాజ్యసమితి (యూఎన్) చార్టర్‌కు విరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. అలాగే ఈ దాడులు ఆ దేశాల భద్రత, స్థిరత్వంతో పాటు అక్కడ నివసిస్తున్న పౌరులు, ప్రవాసుల ప్రాణ భద్రతకు కూడా తీవ్రమైన ముప్పుగా నిలుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బహ్రెయిన్, కువైట్ దేశాలకు జీసీసీ సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు అల్‌బుదైవీ తెలిపారు. తమ భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు, పౌరులు మరియు నివాసితుల రక్షణ కోసం ఆ రెండు దేశాలు తీసుకునే అన్ని చర్యలకు గల్ఫ్ సహకార మండలి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com