బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- July 08, 2026
రియాద్: బహ్రెయిన్ , కువైట్ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడులను గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) ప్రధాన కార్యదర్శి జాసెమ్ మొహమ్మద్ అల్బుదైవీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో శాంతి, భద్రత, సంక్షోభ పరిష్కారానికి జరుగుతున్న ప్రయత్నాలను బలహీనపరిచే ఇరాన్ వైఖరికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
అల్బుదైవీ మాట్లాడుతూ, బహ్రెయిన్, కువైట్లపై జరిగిన ఈ దాడులు రెండు దేశాల సార్వభౌమాధికారంపై ప్రత్యక్ష దాడిగా, అంతర్జాతీయ చట్టాలు మరియు ఐక్యరాజ్యసమితి (యూఎన్) చార్టర్కు విరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. అలాగే ఈ దాడులు ఆ దేశాల భద్రత, స్థిరత్వంతో పాటు అక్కడ నివసిస్తున్న పౌరులు, ప్రవాసుల ప్రాణ భద్రతకు కూడా తీవ్రమైన ముప్పుగా నిలుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బహ్రెయిన్, కువైట్ దేశాలకు జీసీసీ సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు అల్బుదైవీ తెలిపారు. తమ భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు, పౌరులు మరియు నివాసితుల రక్షణ కోసం ఆ రెండు దేశాలు తీసుకునే అన్ని చర్యలకు గల్ఫ్ సహకార మండలి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







