బాలయ్య 'నర్తనశాల' ఫస్ట్ లుక్
- October 20, 2020బాలకృష్ణ దర్శకత్వం వహించిన పౌరాణిక చిత్రం 'నర్తనశాల' ఫస్ట్లుక్ వచ్చేసింది. అర్జునుడి గెటప్లో బాలయ్య అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఈ ప్రచార చిత్రం ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. 'నర్తనశాల'లో ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజు పాత్రలో శరత్బాబు కనిపించనున్నారు.
తన తండ్రి నందమూరి తారక రామారావు నటించిన చిత్రాల్లో 'నర్తనశాల' అంటే బాలయ్యకు చాలా ఇష్టం. అందుకే దాన్ని రీమేక్ చేయాలని సంకల్పించారు. కానీ కొన్ని కారణాల వల్ల చిత్ర నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. . 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాన్ని అక్టోబరు 24న విజయదశమి సందర్భంగా శ్రేయాస్ ఈటీ ద్వారా ఎన్బీకే థియేటర్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు