కరోనా యాంటీబాడీలు: మరింత కలవరపెడుతున్న పరిశోధనలు
- October 21, 2020
న్యూఢిల్లీ: కరోనా బాధితుని శరీరంలో ఆ వైరస్ను ఎదుర్కొనేందుకు యాంటీ బాడీలు తయారవుతాయి. అయితే కొంతకాలం తరువాత ఆ యాంటీ బాడీలు క్షీణిస్తాయి. అప్పడు ఆ బాధితునికి తిరిగి కరోనా సోకే ముప్పు ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ్ మీడియాకు తెలిపారు.
ఈ అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయిని, కొన్ని నివేదికలు బయటకు వచ్చాయని పేర్కొన్నారు. దీని ప్రకారం ఆయా వ్యక్తుల శరీరాలలో యాంటీబాడీలు వేర్వేరు అవధుల వరకూ ఉంటున్నట్లు తేలింది. కొన్ని అధ్యయనాలలో మూడు నెలల వరకూ శరీరంలో యాంటీ బాడీలు ఉంటాయని తేలగా, మరికొన్ని అధ్యయనాల్లో ఐదు నెలల పాటు యాంటీ బాడీలు ఉంటాయని వెల్లడయ్యింది. శరీరంలో యాంటీబాడీలు క్షీనించాక తిరిగి కరోనా వచ్చే అవకాశం ఉందన్నారు. యూరప్, చైనా, అమెరికా, రష్యాతో పాటు పలు దేశాలలో కరోనాతో పోరాడే యాంటీబాడీల విషయమై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









