బహ్రెయిన్:రెస్టారెంట్లు, కేఫ్ లలో టేబుల్ సర్వింగ్ కు గ్రీన్ సిగ్నల్
- October 22, 2020
మనామా :హోటల్ లోపల డైనింగ్ కు అనుమతి ఇస్తూ బహ్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి రెస్టారెంట్లు, కేఫ్ లోపల కూడా డైనింగ్ కు వెసులుబాటు ఉండనుంది. లాక్ డౌన్ తర్వాత దాదాపు ఏడు నెలలుగా హోటల్స్ లోపల సర్వింగ్ పై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా దశల వారీగా ఆంక్షలను సడలిస్తూ వస్తున్న బహ్రెయిన్ ప్రభుత్వం గత సెప్టెంబర్ లోనే రెస్టారెంట్ వెలుపల ఔట్ డోర్ డైనింగ్ కు అనుమతి ఇచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఇండోర్ డైనింగ్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..రెస్టారెంట్లు, కేఫ్ లలో 30 మందికి మించి అనుమతించొద్దని కూడా షరతు విధించింది. ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గనిర్దేశకాలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. గతంలో ఔట్ డోర్ డైనింగ్ కు అనుమతి ఇచ్చిన సమయంలోనూ ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గనిర్దేశకాలను పాటించని పలు రెస్టారెంట్లపై చర్యలు తీసుకున్నారు. హోటల్స్, రెస్టారెంట్లు, కేఫ్ లలో కోవిడ్ నిబంధనల అమలుపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడతామని, ఇది నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియ అని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







