ఆరోగ్య శాఖతో కువైట్ ఎయిర్ లైన్స్ చర్చలు..
- October 23, 2020
కువైట్ సిటీ:కువైట్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి..కువైట్ ఎయిర్ లైన్స్, జజీరా ఎయిర్ వేస్ సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి కువైట్ కు నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు తమకు అనుమతి ఇవ్వాలన్న ఆ రెండు ఎయిర్ లైన్స్ విన్నపంపై మంత్రి ఈ సమావేశంలో చర్చించారు. కోవిడ్ 19 నేపథ్యంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల జాబితాను సిద్ధం చేసిన కువైట్ మొత్తం 34 దేశాల నుంచి విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆ 34 దేశాల నుంచి ప్రయాణికులను అనుమతించటం లేదు. కువైట్ నిషేధిత జాబితాలో భారత్ కూడా ఉంది. అయితే..ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై ఆంక్షలు సడలిస్తుండటంతో..నిషేధిత జాబితాలో ఉన్న ఆ 34 దేశాల నుంచి కూడా కువైట్ కు నేరుగా విమానాలు నడిపేందుకు అనుమతి ఇవ్వాలని, ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కువైట్ చేరుకోగానే ఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని విన్నవించారు. అలాగే క్వారంటైన్ గడువును కూడా 7 రోజులకు కుదించాలని సూచించారు. ఎయిర్ లైన్స్ సంస్థల ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన మంత్రి...ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించి ఆ 34 దేశాల నుంచి కూడా విమాన సర్వీసులు నడుపుకునేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలాఉంటే..ప్రస్తుతం భారత్ నుంచి కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ లేకపోవటంతో భారతీయులు ఇతర దేశాలకు వెళ్లి 14 రోజుల క్వారంటైన్ తర్వాత అక్కడి నుంచి కువైట్ చేరుకోవాల్సి వస్తోంది. ఎయిర్ లైన్స్ విన్నపాలను కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదిస్తే..భారత్ లో ఉండిపోయిన కువైట్ ప్రవాసీయులు నేరుగా కువైట్ చేరుకోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!
- నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!







