పబ్లిక్‌ ఈవెంట్స్‌కి మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అనుమతి తప్పనిసరి

- October 23, 2020 , by Maagulf
పబ్లిక్‌ ఈవెంట్స్‌కి మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అనుమతి తప్పనిసరి

ఖతార్: కోవిడ్‌ 19 ప్రికాషరనీ మెజర్స్‌లో భాగంగా ఎగ్జిబిషన్స్‌, కాన్ఫరెన్స్‌, కల్చరల్‌ మరియు స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ నిర్వాహకులు మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ నుంచి తప్పక అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. మినీస్ట్రీ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వేదిక, పార్టిసిపెంట్స్‌ వంటి పూర్తి వివరాలు మినిస్ట్రీకి నిర్వాహకులు సమర్పించాలి. అనుమతి పొందిన తర్వాత, నిర్వాహకులు పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకుని, కోవిడ్‌ 19 ప్రోటోకాల్స్‌ అమలయ్యేలా చూడాల్సి వుంటుంది. గెస్ట్‌లు విదేశాల నుంచి వచ్చేవారైతే, వారికి సంబంధించి పీసీఆర్‌ టెస్ట్‌ తదితర అంశాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ఎగ్జిబిటర్స్‌, స్పీకర్స్‌, ఆర్గనైజర్స్‌ అలాగే పార్టిసిపెంట్స్‌ తప్పక ఫేస్‌ మాస్క్‌ ధరించాల్సి వుంటుంది. దాంతోపాటుగా సోషల్‌ డిస్టెన్సింగ్‌ తప్పనిసరి. శరీర ఉష్ణోగ్రత విషయంలోనూ, ఇతరత్రా నిబంధనల విషయంలోనూ ఖచ్చితంగా వ్యవహరించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com