సోమాలియాలో చిక్కుకున్న 33 మంది భారతీయులు:జైశంకర్
- October 24, 2020
న్యూఢిల్లీ: సోమాలియాలోని ఓ పరిశ్రమలో బందీలుగా ఉన్న 33 మంది భారతీయులను తిరిగి స్వదేశానికి రప్పించడం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు. నైరోబిలోని భారత హైకమిషన్ అక్కడి అధికారులో సంప్రదింపులు జరుపుతోందని వివరించారు. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ విజృంభణకు ముందు ఉత్తరప్రదేశ్కు చెందిన 25 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 8 మంది ఉపాధి కోసం సోమాలియా వెళ్లారు. అక్కడ ఓ పరిశ్రమలో వారికి పని దొరికింది. పనిలో చేరిన తొలినాళ్లలో యజమానులు వారిని బాగానే చూసుకున్నారు. జీతభత్యాలను క్రమం తప్పకుండా చెల్లించారు. అయితే గత ఎనిమిది నెలలుగా వారికి జీతాలు చెల్లించకుండా పని చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో వాళ్లు తమ సమస్యను భారత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం.. వారి సమస్యను పరిష్కరించి, స్వదేశానికి తరలించడం కోసం చర్యలు తీసుకోవాలని సోమాలియాలోని ఇండియన్ హైకమిషన్ను అదేశించింది. అంతేకాకుండా భారత్లో ఉన్న సోమాలియా ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ట్విట్టర్లో వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







