కనీస వేతనమడిగితే... ఉద్యోగాలకే ఎసరు ?
- February 14, 2016
కనీస వేతనాలు అమలు పర్చమని భారత్ కోరడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కార్మిక విపణిలో పలు కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యపడదని కినుక వహిస్తున్నాయి. నూతన యు.ఎ.ఇ.కార్మిక చట్ట ప్రకారం విదేశీయులకు పని అనుమతి ఇచ్చేముందు యజమానితో పని ఒప్పందం సంతకం చేయాల్సిఉంది అయెతే..యు.ఎ.ఇ. నైపుణ్యం కల్గిన కార్మికులకు సైతం కనీస వేతనాల అమలు గూర్చి ప్రస్తావించలేదు. ఈ లోపాన్ని సాకుగా తీసుకొని యు.ఎ.ఇ. పలు కంపెనీల యాజమాన్యాలు నేరుగా భారత్ ప్రభుత్వాన్ని సంప్రదించి నైపుణ్యమున్న కార్మికులను తమకు కావాలని కోరుతుంది. ఈ విధంగా భర్తీ చేసుకొన్న వెళ ప్రకటించిన వేతనం కంటే తక్కువ జీతాన్ని కార్మికులకు ఇవ్వడం భరత్ ప్రభుత్వం గమనించింది. యు.ఎ.ఇ.లో పలు కంపెనీలు తక్కువ జీతంకు భారత్ కార్మికులను పని ఒప్పందం కుడుర్చుకొంటున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కార్మిక మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చేనట్లే భారత ప్రభుత్వం అనుమతి ఇస్తుందేమోనని యాజమాన్యాలు ఆశించాయి. ఈ పరిస్థితులలో భారత కార్మికులకు కనీస వేతనాలు అమలు పర్చమని భారత్ కోరడంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం, యు.ఎ.ఇ. కంపెనీ యాజమాన్యాల మధ్య వేతనాల ఘర్షణ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







