విజయదశమినాడు లాంఛనంగా ప్రారంభమైన 'థాంక్యూ'
- October 26, 2020
హైదరాబాద్:యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై 'థాంక్యూ' సినిమా విజయదశమిరోజున లాంఛనంగా ప్రారంభమైంది. 'ఇష్క్, మనం, 24' వంటి వైవిధ్యమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్సియర్ సత్య రంగయ్య క్లాప్ కొట్టారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - "విజయ దశమి అంటే చెడుపై మంచి విజయం సాధించిన రోజు. చాలా మంచిరోజు. అందుకనే మా 'థాంక్యూ' సినిమాను ఈరోజు లాంఛనంగా ప్రారంభించాం. రెగ్యులర్ షూటింగ్ను త్వరలోనే ప్రారంభించనున్నాం. డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్, చైతన్య కాంబినేషన్లో వచ్చిన 'మనం' ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. అలాంటి కాంబినేషన్లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలుంటాయో తెలిసిందే. ప్రేక్షకాభిమానులను ఆకట్టుకునేలా ఇప్పటి వరకు చూడని స్టైల్లో సరికొత్తగా నాగచైతన్యను ప్రెజెంట్ చేసేలా సినిమా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తాం" అని అన్నారు.
నటీనటులు:
నాగచైతన్య అక్కినేని
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం: ఎస్.ఎస్.తమన్
సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాతలు - రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి
కథ, మాటలు - బి.వి.ఎస్. రవి
స్క్రీన్ప్లే, దర్శకత్వం - విక్రమ్ కె.కుమార్
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







