నవంబర్‌1నే ఏ.పి‌ అవతరణ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం

- October 28, 2020 , by Maagulf
నవంబర్‌1నే ఏ.పి‌ అవతరణ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం

ఏ.పి:నవంబర్‌1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని రాజధానిలోను, అలాగే అన్ని జిల్లాల్లోనూ నిర్వహించాలంటూ జీవో కూడా జారీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన TDP ప్రభుత్వం అవతరణ దినోత్సవానికి బదులు అపాయింట్‌డేగా ప్రకటించిన జూన్‌ 2న నవనిర్మాణ దీక్షలు చేపట్టేది. నవ్యాంధ్ర పునర్‌నిర్మాణానికి కట్టుబడి ఉందామంటూ ప్రతిజ్ఞ చేయిస్తూ ఈ నవనిర్మాణ దీక్షకు శ్రీకారం చూట్టారు. కానీ YCP అధికారంలోకి వచ్చాక నవంబర్‌ 1న అవతరణ దినోత్సవం జరపాలని నిర్ణయించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com