ఎస్‌ఎంసి ఫార్మసీ స్టాఫ్‌కి ఐదేళ్ళ జైలు శిక్ష

- October 29, 2020 , by Maagulf
ఎస్‌ఎంసి ఫార్మసీ స్టాఫ్‌కి ఐదేళ్ళ జైలు శిక్ష

మనామా:ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఫైనాన్షియల్‌ నేరాలు అలాగే మనీ లాండరింగ్‌ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ మొహమ్మద్‌ జమాల్‌ సుల్తాన్‌ ఈ విషయాల్ని ధృవీకరించారు. నిందితుల్లో ఒకరు మహిళ, మరో ఇద్దరు పురుషులు. వీరంతా సల్మానియా మెడికల్‌ కాంప్లెక్స్‌ (ఎస్‌ఎంసి) ఫార్మసీ ఉద్యోగులు. వీరికి 500 బహ్రెయినీ దినార్స్‌ చొప్పున జరీమానా కూడా విధించడం జరిగింది. మందుల్ని దొంగతనం చేసినట్లు నిందితులపై అభియోగాలు నిరూపించబడ్డాయి. దొంగతనానికి గురైన మందుల విలువను కూడా నిందితులు చెల్లించాల్సి వుంటుంది. గత నెలలో నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. ఫిమేల్‌ సూపర్‌వైజర్‌ సాయంతో నిందితులు దొంగతనానికి పాల్పడ్డారు. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ ఈ ఘటనపై విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా నిందితుల నేరం రుజువయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com