డిపిఎస్ షార్జా ఫౌండింగ్ ప్రిన్సిపల్ మృతి
- October 30, 2020
షార్జా: అభా సెహగల్, యూఏఈ మాజీ రెసిడెంట్, ప్రముఖ విద్యావేత్త, ఇండియన్ కరికులం స్కూల్ డిపిఎస్ షార్జా వ్యవస్థాపక ప్రిన్సిపల్ ఇక లేరు. సెహగల్, న్యూ ఢిల్లీలో బుధవారం తుదిశ్వాస విడిచినట్లు డిపిఎస్ దుబాయ్, డిపిఎస్ షార్జా మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కొటారీ వెల్లడించారు. 2000 నుంచి 2008 వరకు అభా సెహగల్ సేవలందించారు. ఎడ్యుకేషనిస్ట్, ఐకానిక్ ప్రిన్సిపల్గానే కాదు, మానవతావాదిగా కూడా ఆమె ఎంతో ఉన్నత స్థితికి ఎదిగారని కొటారి అభిప్రాయపడ్డారు. వ్యక్తిగతంగా తనకు అభా సెహగల్ మృతి తీరని లోటు అని చెప్పారు కొటారి. డిపిఎస్ షార్జా ప్రస్తుత ప్రిన్సిపల్ వందన మర్వాహ్ మాట్లాడుతూ, 1989 నుంచి తాను అభా సెహగల్తో అసోసియేట్ అయి వున్నాననీ, ఆమెతో తన బంధం ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. న్యూ ఢిల్లీ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ భాను శర్మ మాట్లాడుతూ, ఎనిమిదేళ్ళపాటు ఆమెతో కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కిందని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







