భారత్ లో తగ్గిన కొత్త కోవిడ్‌ కేసులు

- October 30, 2020 , by Maagulf
భారత్ లో తగ్గిన కొత్త కోవిడ్‌ కేసులు

న్యూ ఢిల్లీ:భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకీ తగ్గుతూ వస్తున్నాయి... ఏ రోజు తీసుకున్నా.. 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతూ రాగా.. ప్రస్తుతం అవి తగ్గుతున్నాయి... కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం... గత 24 గంటల్లో కొత్తగా 48,648 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి... 563 మంది మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో రికవరీ కేసుల సంఖ్య మరింత పెరిగింది.. 24 గంటల్లో 57,386 మంది రికవరీ అయ్యారు... దీంతో... మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 80,88,851కు చేరుకోగా... ఇప్పటి వరకు 1,21,090 మంది మృతిచెందారు... కరోనాబారినపడి ఇప్పటి వరకు 73,73,375 మంది రికవరీ అయ్యారు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,94,386 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టుగా బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు... గురువారం రోజు దేశవ్యాప్తంగా.. 11,64,648 శాంపిల్స్ పరీక్షించామని.. టెస్టుల సంఖ్య 10,77,28,088కు చేరినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com