ఆన్లైన్ మాయగాళ్ళతో మీ పిల్లలు జాగ్రత్త
- February 15, 2016
ఆన్లైన్లో మాయగాళ్ళు, నేరగాళ్ళు పెరిగిపోయారని రాయల్ ఒమన్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తూ ఈ మాయగాళ్ళు, నేరగాళ్ళ బారిన పడి పిల్లలు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. రేప్ కేసులు కూడా వెలుగు చూస్తుండడం బాధాకరం. రాయల్ ఒమన్ పోలీస్ ఎకనమిక్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ కెప్టెన్ ఘస్సన్ అల్ జద్జలి మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా ఆడపిల్లలకు వలవేసే కేటుగాళ్ళు, తాము చెప్పిన చోటకి వారిని రప్పించి, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు. మొబైల్ యాప్స్, ఇతర మార్గాల ద్వారా సోషల్ మీడియాని, ఆన్లైన్ని వినియోగించే విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలనీ, వారి చర్యలపై దృష్టిపెట్టాలని కోరారు. అనవసరమైన యాప్స్ని డౌన్ లోడ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని ఆయన తెలిపారు. ఇంటర్నెట్ వినియోగం విషయంలో పిల్లలకు పూర్తిగా అవగాహన కల్పించాలనీ, అనుమానం వస్తే పోలీసులను సంప్రదించాలని ఘన్సన్ చెప్పారు.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







