మలయాళ సంగీత దర్శకుడు రాజమణి కన్నుమూత

- February 15, 2016 , by Maagulf
మలయాళ సంగీత దర్శకుడు రాజమణి కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు రాజమణి (60) కన్నుమూశారు. గత రాత్రి అస్వస్థతకు గురైన ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు చిదంబరనాథ్‌ కుమారుడైన రాజమణి దాదాపు 70 మలయాళ చిత్రాలకు నేపథ్య సంగీతాన్ని అందించారు. 1985లో రాజమణి మలయాళ చిత్రసీమలో అడుగుపెట్టారు. నరసింహం, రావణప్రభు లాంటి సూపర్‌హిట్‌ సినిమాలకు సంగీతం సమకూర్చారు. కేరళ స్టేట్‌ ఫిలిం అవార్డు అందుకున్నారు. రాజమణి కుమారుడు అచ్చు తమిళ, తెలుగు సినీ పరిశ్రమలలో సంగీతదర్శకుడిగా పనిచేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com