ప్రియమణి ఈ ఏడాది పెళ్లి చేసుకోనుంది
- February 15, 2016
అందాలతార అసిన్ గత నెలలోనే పెళ్లి చేసుకుని స్థిరపడిపోగా ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అవుతోంది. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో స్టార్ హీరోయిన్గా అలరించిన ప్రియమణి ఈ ఏడాది పెళ్లి చేసుకోనుంది. బోయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్ను తాను పెళ్లాడనున్నట్లు ఓ టీవీ కార్యక్రమంలో స్వయంగా వెల్లడించింది. ముస్తఫారాజ్ ను మొదటిసారి ఓ డ్యాన్స్ షోలో కలిశానని, తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారిందని ప్రియమణి తెలిపింది. ముస్తఫారాజ్ ముంబైలో ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం.అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ ఏడాది చివరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించేందుకు తనకు అభ్యంతరం లేదని, మంచి స్క్రిప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పింది.తెలుగుతో పాటు పలు భాషల్లో విజయవంతమైన సినిమాల్లో నటించిన ప్రియమణి తమిళంలో నటించిన 'పరుత్తివీరన్' సినిమాకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







