పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న'మెరిసే మెరిసే'
- October 31, 2020
హైదరాబాద్:కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ''మెరిసే మెరిసే''. ఈ చిత్రంలో హుషారు ఫెమ్ దినేష్ తేజ్ హీరోగా నటిస్తుండగా శ్వేతా అవస్తీ హీరోయిన్ గా నటిస్తోంది. కామెడీ, లవ్, ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్.కె మాట్లాడుతూ...
మెరిసే మెరిసే మూవీ చాలా బాగా వచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఇటీవల విడుదలైన మా సినిమా థీమ్ పోస్టర్, ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభించింది. త్వరలోనే ఈ సినిమాలోని పాటలను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాము. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా అవస్తి బాగా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మా సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని తెలిపారు.
నిర్మాత వెంకటేష్ కొత్తూరి మాట్లాడుతూ...
సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాము. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతోంది. మా మూవీకి మీ అందరి సపోర్ట్ కావాలని అన్నారు.
నటీనటులు:
దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, కాటలిన్, శశాంక్, నానాజీ.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: కొత్తూరి ఎంటర్త్సైన్మెంట్స్
నిర్మాత: వెంకటేష్ కొత్తూరి
దర్శకత్వం: పవన్ కుమార్. కె
కెమెరామెన్: నగేష్ బన్నెల్
సంగీతం: కార్తిక్ కొడగండ్ల
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







