కువైట్‌కు విమాన సర్వీసులు పెంచనున్న : ఎయిర్ ఇండియా

- February 15, 2016 , by Maagulf
కువైట్‌కు విమాన సర్వీసులు పెంచనున్న : ఎయిర్ ఇండియా

ఎయిర్ ఇండియా నిర్వహిస్తున్న చౌక విమాన సర్వీసు అయిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్(ఏఐఈ)లను సేవలను మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. కేరళ నుంచి మధ్య ప్రాచ్య దేశాలకు నడుపుతున్న ఈ సర్వీసులను విస్తరించనున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇందులో భాగంగా కోజికోడ్ నుంచి కేరళకు వారంలో మూడు రోజులు నడుపుతున్న సర్వీసులను ఇకనుంచి ఐదురోజులకు పెంచనుంది. ప్రస్తుతం కోజికోడ్-కువైట్ రూట్‌లో మంగళవారం, గురువారం, ఆదివారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. వీటిని వారానికి ఐదుసార్లకు పెంచనున్నారు. మరో ఆరు బోయింగ్ 737-800 విమానాలతో తమ సర్వీసులను విస్తరించేందుకు ఎయిర్ ఇండియా ప్రణాళిక సిద్ధం చేసింది. మరో తొమ్మిది నెలల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. అలాగే కోచి నుంచి డామన్, రస్ అల్-ఖైమా, కోజికోడ్‌లకు రెండు నూతన సర్వీసులను ప్రవేశపెట్టనుంది. వీటితో కలిసి కేరళ నుంచి మధ్యప్రాచ్యానికి ఎయిర్ ఇండియా నడుపుతున్న విమానాల సంఖ్య 11కు చేరనుంది. అంతేకాక టూటైర్ నగరాలైన అమృత్‌సర్, చండీగఢ్, లక్నో, వారణాసి, జైపూర్, మధురైల నుంచి వివిధ ఆసియా దేశాలకు విమానాలు నడిపాలని ఎయిర్ ఇండియా ప్రణాళిక రచిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com