రాజ్తరుణ్ హీరోగా చిత్రం ప్రారంభం
- November 03, 2020
హైదరాబాద్:యువ కథానాయకుడు రాజ్తరుణ్ హీరోగా శాంటో దర్శకత్వంలో కొత్త చిత్రం మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నంద్కుమార్ అభినేని, భరత్ మగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వర్షా బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సందర్భంగా...
నిర్మాతలు నంద్కుమార్ అభినేని, భరత్ మగులూరి మాట్లాడుతూ - ``రాజ్తరుణ్గారితో మా బ్యానర్లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ శాంటో చెప్పిన కథ నచ్చింది. అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను రూపొందిస్తాం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తాం. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం`` అన్నారు.
దర్శకుడు శాంటో మాట్లాడుతూ - ``రాజ్తరుణ్ హీరోగా నటిస్తున్న 15వ సినిమా ఇది. ఆయన్ని కొత్త యాంగిల్లో ప్రెజంట్ చేస్తూ అందరినీ ఆకట్టుకునే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్లా సినిమా ఉంటుంది. నిర్మాతలకు థాంక్స్. త్వరలోనే సెట్స్పైకి వెళతాం`` అన్నారు.
నటీనటులు:
రాజ్తరుణ్, వర్షా బొల్లమ్మ, వెన్నెల కిషోర్ తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: శాంటో
నిర్మాతలు: నంద్కుమార్ అభినేని, భరత్ మగులూరి
సంగీతం: స్వీకర్ అగస్తి
సినిమాటోగ్రఫీ: శ్రీరాజ్ రవీంద్రన్
కాస్ట్యూమ్ డిజైన్: అర్చనా రావ్
ప్రొడక్షన్ డిజైన్: ఉదయ్, రవీన
ఎడిటర్: శ్రవణ్ కటికనేని
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







