రాజ్తరుణ్ హీరోగా చిత్రం ప్రారంభం
- November 03, 2020
హైదరాబాద్:యువ కథానాయకుడు రాజ్తరుణ్ హీరోగా శాంటో దర్శకత్వంలో కొత్త చిత్రం మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నంద్కుమార్ అభినేని, భరత్ మగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వర్షా బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సందర్భంగా...
నిర్మాతలు నంద్కుమార్ అభినేని, భరత్ మగులూరి మాట్లాడుతూ - ``రాజ్తరుణ్గారితో మా బ్యానర్లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ శాంటో చెప్పిన కథ నచ్చింది. అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను రూపొందిస్తాం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తాం. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం`` అన్నారు.
దర్శకుడు శాంటో మాట్లాడుతూ - ``రాజ్తరుణ్ హీరోగా నటిస్తున్న 15వ సినిమా ఇది. ఆయన్ని కొత్త యాంగిల్లో ప్రెజంట్ చేస్తూ అందరినీ ఆకట్టుకునే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్లా సినిమా ఉంటుంది. నిర్మాతలకు థాంక్స్. త్వరలోనే సెట్స్పైకి వెళతాం`` అన్నారు.
నటీనటులు:
రాజ్తరుణ్, వర్షా బొల్లమ్మ, వెన్నెల కిషోర్ తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: శాంటో
నిర్మాతలు: నంద్కుమార్ అభినేని, భరత్ మగులూరి
సంగీతం: స్వీకర్ అగస్తి
సినిమాటోగ్రఫీ: శ్రీరాజ్ రవీంద్రన్
కాస్ట్యూమ్ డిజైన్: అర్చనా రావ్
ప్రొడక్షన్ డిజైన్: ఉదయ్, రవీన
ఎడిటర్: శ్రవణ్ కటికనేని
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







