కరోనా వైరస్: ఫ్రంట్లైన్ వర్కర్స్ కోసం వ్యాక్సిన్
- November 04, 2020
బహ్రెయిన్: చైనీస్ కోవిడ్ 19 వ్యాక్సిన్ని ఫ్రంట్లైన్ వర్కర్స్కి ఇచ్చే ప్రక్రియను బహ్రెయిన్ ప్రారంభించింది. ఎమర్జన్సీ అప్రూవల్ కింద ఈ వ్యాక్సిన్ని అందిస్తున్నట్లు బహ్రెయిన్ పేర్కొంది. చైనాకి చెందిన సినోఫాం సంస్థ, ఈజిప్ట్, యూఏఈ, బహ్రెయిన్ మరియు జోర్డాన్లలో కరోనా వ్యాక్సిన్కి సంబంధించి 3వ ఫేజ్ ట్రయల్స్ ప్రారంభించిన విషయం విదితమే. బహ్రెయిన్ హెల్త్ మినిస్టర్ ఫయీకా బింట్ సయీద్ అల్ సలెహ్ మాట్లాడుతూ, ఈ వ్యాక్సిన్ దేశానికి సంబంధించిన రెగ్యులేషన్స్కి అనుగుణంగా వుందని చెప్పారు. ఫేజ్ వన్, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ ద్వారా ఈ వ్యాక్సిన్ ఆశాజనకమైన ఫలితాలు ఇచ్చిందని అన్నారు. మూడో దశ ప్రయోగాల కోసం 7,770 మందిని ఎంపిక చేశారు. కాగా, అబుదాబీకి చెందిన ఓ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ, మిడిల్ ఈస్ట్లో ట్రయల్స్ని పర్యవేక్షిస్తోంది. 31,000 మందికి పైగా వ్యక్తులపై నాలుగు దేశాల్లో ఈ ట్రయల్స్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







