కోవిడ్ 19 కేసులు పెరిగితే, పాక్షిక లాక్డౌన్
- November 04, 2020కువైట్: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, దేశంలో కరోనా పరిస్థితులపై ప్రత్యేక దృష్టి కొనసాగిస్తోంది. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అథారిటీస్ అంచనా వేస్తున్నాయి. దేశం లోపల, దేశం వెలుపల కరోనా పరిస్థితుల్ని ఆరా తీస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అంచనా వేయడం జరుగుతోందని అథారిటీస్ పేర్కొన్నాయి. అవసరమైతే పాక్షిక లాక్డౌన్ మరోసారి విధించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కోవిడ్ 19 గణాంకాలు, ఇన్ఫెక్షన్స్, హాస్పిటలైజేషన్స్, మృతుల సంఖ్య, ఐసీయూలో చేరుతున్నవారి సంఖ్య.. ఇలా పలు అంశాల్ని విశ్లేషించడం జరుగుతోందని మినిస్ట్రీ అధికార ప్రతినిది¸ అబ్దుల్లా అల్ సనద్ చెప్పారు. పరిస్థితుల్ని అంచనా వేసి, అవసరమైతే పాక్షికంగా లాక్డౌన్ని అమలు చేసే అవకాశం వుందని వివరించారు. అయితే, ప్రస్తుతం కరోనా అదుపులోనే వున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..