కోవిడ్ 19 కేసులు పెరిగితే, పాక్షిక లాక్డౌన్
- November 04, 2020
కువైట్: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, దేశంలో కరోనా పరిస్థితులపై ప్రత్యేక దృష్టి కొనసాగిస్తోంది. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అథారిటీస్ అంచనా వేస్తున్నాయి. దేశం లోపల, దేశం వెలుపల కరోనా పరిస్థితుల్ని ఆరా తీస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అంచనా వేయడం జరుగుతోందని అథారిటీస్ పేర్కొన్నాయి. అవసరమైతే పాక్షిక లాక్డౌన్ మరోసారి విధించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కోవిడ్ 19 గణాంకాలు, ఇన్ఫెక్షన్స్, హాస్పిటలైజేషన్స్, మృతుల సంఖ్య, ఐసీయూలో చేరుతున్నవారి సంఖ్య.. ఇలా పలు అంశాల్ని విశ్లేషించడం జరుగుతోందని మినిస్ట్రీ అధికార ప్రతినిది¸ అబ్దుల్లా అల్ సనద్ చెప్పారు. పరిస్థితుల్ని అంచనా వేసి, అవసరమైతే పాక్షికంగా లాక్డౌన్ని అమలు చేసే అవకాశం వుందని వివరించారు. అయితే, ప్రస్తుతం కరోనా అదుపులోనే వున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







