'ఖుషి' ఎడిటర్ కన్నుమూత
- November 04, 2020తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలకు ఎడిటర్గా పనిచేసిన కోలా భాస్కర్(55) కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. 'ఖుషి', '7/జీ బృందావన్ కాలనీ', 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే', '3', 'కుట్టి' వంటి చిత్రాలకు ఆయన ఎడిటర్గా పనిచేశారు. సెల్వ రాఘవన్తో మంచి సాన్నిహిత్యం కలిగిన కోలా భాస్కర్.. ఆయన తీసిన పలు చిత్రాలకు ఎడిటర్గా పనిచేశారు.
ఇక ఆయన కుమారుడు కోలా బాలకృష్ణ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన మాలై నేరతు మయక్కమ్(తెలుగులో నన్ను వదిలి నీవు పోలేవుతే) అనే మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీని కోలా భాస్కర్ నిర్మించారు. మరోవైపు ఆయన మరణంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. కోలా భాస్కర్ ఆత్మకు శాంతి కలగాలంటూ కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!