'ఖుషి' ఎడిటర్ కన్నుమూత

- November 04, 2020 , by Maagulf
\'ఖుషి\' ఎడిటర్ కన్నుమూత

తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన కోలా భాస్కర్(55) కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. 'ఖుషి', '7/జీ బృందావన్ కాలనీ', 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే', '3', 'కుట్టి' వంటి చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. సెల్వ రాఘవన్‌తో మంచి సాన్నిహిత్యం కలిగిన కోలా భాస్కర్‌.. ఆయన తీసిన పలు చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు.

ఇక ఆయన కుమారుడు కోలా బాలకృష్ణ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన మాలై నేరతు మయక్కమ్(తెలుగులో నన్ను వదిలి నీవు పోలేవుతే) అనే మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీని కోలా భాస్కర్ నిర్మించారు. మరోవైపు ఆయన మరణంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. కోలా భాస్కర్ ఆత్మకు శాంతి కలగాలంటూ కోరుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com