ఆపరేషన్ ముస్కాన్ పై వెబినార్..పాల్గొన్నహోం మంత్రి, డీజీపీ గౌతమ్
- November 04, 2020
గుంటూరు: ఆపరేషన్ ముస్కాన్ పై నిర్వహించిన వెబినార్ లో హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాoగ్ లు పాల్గొన్నారు. వారితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు అనురాధ, కృత్తికా శుక్లా, దీపికా పాటిల్, పోలీస్ అధికారులు, అన్ని జిల్లాల నుండి న్యాయ, కార్మిక శాఖ, వివిధశాఖల అధికారులు హాజరయ్యారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా బాలల కార్మికుల విముక్తి కోసం ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వినూత్న రీతిలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోను పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో జరుపుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు జరిపిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను విభిన్నంగా నిర్వహించారు. వారోత్సవాలుతోపాటు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపట్టింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ. 10 రోజుల పాటు చేపట్టిన ఈ ఆపరేషన్ ముస్కాన్ లో 16 వేల మంది బాల బాలికలను గుర్తించి సంరక్షించినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రభుత్వం అందించే అన్ని కార్యక్రమాలు బాలలకు అందించాలని హోంమంత్రి సుచరిత అన్నారు. బాలల సంరక్షణ కోసం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. నేటి బాలలు రేపటి పౌరులు అనేది పాత నినాదమని...నేటి వీధి బాలలే రేపటి ఉన్నత విద్యావంతులు అన్నది నేటి విధానమని సురచరిత అన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జునైల్ జస్టిస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







