పర్యాటక రంగంలో సహకారంపై బహ్రెయిన్, ఇజ్రాయెల్ చర్చలు..
- November 04, 2020
మనామా:చారిత్రాత్మక శాంతి ఒప్పందం తర్వాత బహ్రెయిన్, ఇజ్రాయెల్ మరో స్నేహపూర్వక అడుగు వేశాయి. ఇజ్రాయెల్ టూరిజం శాఖ మంత్రికి ఫోన్ చేసిన బహ్రెయిన్ పారిశ్రామిక, వాణిజ్య శాఖ మంత్రి..పర్యాటక రంగంలో పరస్పర సహకారంపై చర్చించారు. ఇరు దేశాల సత్సంబంధాలు పర్యాటక రంగ అభివృద్ధిలో సానుకూల ఫలితాలను సాధించేందుకు ఎంతగానో దోహదపడుతాయని విశ్వసిస్తున్నట్లు ఇరువురు మంత్రులు విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య పర్యాటకుల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ప్రయాణా నిబంధనలను సులభతరం చేసే అంశంపై కూడా చర్చలు కొనసాగాయి.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్.. అబుదాబి, దుబాయ్, ఫుజైరా కనెక్ట్..ఫుల్ డిటైల్స్..!!
- బుఖా ఘటనలో ఇద్దరు విదేశీయులకు గాయాలు, వాహనాలకు నష్టం..!!
- హోర్ముజ్ జలసంధిని "బేరసారాల సాధనంగా" చేయొద్దు: ఖతార్
- బహ్రెయిన్ లో డ్రైవర్కు 7 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా యూఏఈకి సౌదీ మద్దతు..!!
- జహ్రా వైపు వెళ్లే ఐదవ రింగ్ రోడ్ ఈనెల 16 వరకు పాక్షికంగా మూసివేత..!!
- భారతీయుల పై దాడి.. ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం!
- విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం









