కోవిడ్ 19: అబుధాబికి వచ్చే ప్రయాణికులకు కొత్త మార్గనిర్దేకాలు జారీ
- November 04, 2020
అబుధాబి:అబుధాబికి వచ్చే ప్రయాణికులకు కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. అబుధాబి మీదుగా యూఏఈకి చేరుకునే పౌరులు, ప్రవాసీయులతో పాటు అబుధాబి నివాసితులు సైతం కోవిడ్ టెస్ట్ చేయించుకున్న 48 గంటల్లో అబుధాబి చేరుకోవాలని అబుధాబి కోవిడ్ 19 అత్యవసర, విపత్తుల నిర్వహణ కమిటీ స్పష్టం చేసింది. పీసీఆర్ టెస్ట్ చేయించుకోని వారు డీపీఐ లేసేర్ టెస్ట్ రిపోర్ట్ ను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. అంతేకాదు..అబుధాబిలో నాలుగు రోజులు ఉండే వారు తప్పనిసరిగా నాలుగో రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. అబుధాబిలో అడుగుపెట్టిన రోజును తొలి రోజుగా పరిగణిస్తారు. అంటే ఆదివారం అబుధాబికి చేరుకుంటే బుధవారం రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎనిమిది రోజులకు మించి అబుధాబిలో ఉంటే 8వ రోజున కూడా మరోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవటం తప్పనిసరి. అంటే 8 రోజుల వ్యవధిలో రెండుసార్లు టెస్ట్ చేయించుకోవాల్సిందేనని కమిటీ తమ కొత్త నిబంధనల్లో సూచించింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో డ్రైవర్కు 7 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా యూఏఈకి సౌదీ మద్దతు..!!
- జహ్రా వైపు వెళ్లే ఐదవ రింగ్ రోడ్ ఈనెల 16 వరకు పాక్షికంగా మూసివేత..!!
- భారతీయుల పై దాడి.. ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం!
- విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం
- విజయ్ కీలక నిర్ణయం..
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్
- మక్కాలో మహిళను వేధించిన ప్రవాసి అరెస్టు..!!









