కోవిడ్ 19: అబుధాబికి వచ్చే ప్రయాణికులకు కొత్త మార్గనిర్దేకాలు జారీ
- November 04, 2020
అబుధాబి:అబుధాబికి వచ్చే ప్రయాణికులకు కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. అబుధాబి మీదుగా యూఏఈకి చేరుకునే పౌరులు, ప్రవాసీయులతో పాటు అబుధాబి నివాసితులు సైతం కోవిడ్ టెస్ట్ చేయించుకున్న 48 గంటల్లో అబుధాబి చేరుకోవాలని అబుధాబి కోవిడ్ 19 అత్యవసర, విపత్తుల నిర్వహణ కమిటీ స్పష్టం చేసింది. పీసీఆర్ టెస్ట్ చేయించుకోని వారు డీపీఐ లేసేర్ టెస్ట్ రిపోర్ట్ ను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. అంతేకాదు..అబుధాబిలో నాలుగు రోజులు ఉండే వారు తప్పనిసరిగా నాలుగో రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. అబుధాబిలో అడుగుపెట్టిన రోజును తొలి రోజుగా పరిగణిస్తారు. అంటే ఆదివారం అబుధాబికి చేరుకుంటే బుధవారం రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎనిమిది రోజులకు మించి అబుధాబిలో ఉంటే 8వ రోజున కూడా మరోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవటం తప్పనిసరి. అంటే 8 రోజుల వ్యవధిలో రెండుసార్లు టెస్ట్ చేయించుకోవాల్సిందేనని కమిటీ తమ కొత్త నిబంధనల్లో సూచించింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







