సౌదీ: హద్దు దాటిన వాహనదారులకు ఇక వాయింపే..
- November 06, 2020
సౌదీ అరేబియా:నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేసే వాహనదారులను కట్టడి చేసేందుకు త్వరలోనే ఆటోమేటిక్ మానిటరింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది సౌదీ ప్రభుత్వం. ఇక రోడ్లపై ముందస్తు సిగ్నల్ ఇవ్వకుండా ఇస్టానుసారంగా లేన్లు మార్చుతూ డ్రైవింగ్ చేసే వాహనాలను ఈ ఆటోమేటిక్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పసిగట్టవచ్చు. ఈ సిస్టంను ముందుగా రియాద్, దమ్మమ్, జెడ్డా నగరాల్లో అమలు చేయనున్నారు. వచ్చే వారం రోజుల్లోనే మానిటరింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దీంతో వాహనాల కదలికలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. రహదారులపై ప్రమాదాల నియంత్రణను దృష్టిలో పెట్టుకొని ఆటోమేటిక్ మానిటరింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం









