ఒమన్ మవసలాత్లో ఏసీ బస్స్టేషన్లు, సెపరేట్ లేన్
- February 15, 2016
ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ (ఎంఓటిసి) మవసలాత్ బస్సుల కోసం ఎయిర్ కండిషన్డ్ బస్ స్టేషన్స్, డెడికేటెడ్ లేన్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. మవసలాత్ బస్సులు ప్రారంభమైనప్పటినుంచీ వాటికి లభిస్తున్న ఆదరణతో ఈ ఆలోచన చేస్తున్నారు. రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో స్పెషల్ లేన్ ఏర్పాటు చేస్తే, దాన్ని అత్యవసర సమయాల్లోనూ వినియోగించుకోవడానికి వీలవుతుందని ట్రాన్స్పోర్ట్ ఎఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ అండర్ సెక్రెటరీ సలీమ్ బిన్ మహమ్మద్ అల్ నౌమి చెప్పారు. తొలి 70 రోజుల్లో 600,000 మంది ప్రయాణీకులు మవసలాత్ సర్వీసులను వినియోగించుకున్నారనీ, రోజుకు సరాసరి ఈ సంఖ్య 9,000 మందిగా ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2016 తొలి క్వార్టర్లో కొత్తగా రెండు రూట్స్ని ప్రకటించి, బస్సులను నడపనుంది. రువి - ముత్రాహ్, రువి - అల్ అమీరాత్ ఆ రెండు కొత్త రూట్లు. మవసలాత్ బస్సులను నడిపేందుకు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. అలాగే రోడ్లను విస్తరించడంపైనా ఒమన్ ప్రత్యేక దృష్టిపెట్టింది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







