చైనా నుంచి టెహ్రాన్‌ చేరుకున్న తొలి 'సిల్క్‌ రోడ్‌' ట్రైన్‌

- February 15, 2016 , by Maagulf
చైనా నుంచి టెహ్రాన్‌ చేరుకున్న తొలి 'సిల్క్‌ రోడ్‌' ట్రైన్‌

చైనా, ఇరాన్‌లను కలిపే ట్రైన్‌ తొలిసారిగా టెహ్రాన్‌ చేరుకుంది. చైనా నుంచి పెద్ద మొత్తంలో గూడ్స్‌ ఈ ట్రైన్‌ ద్వారా చేరుకుంటున్నట్లు ఇరానియన్‌ రైల్వే కంపెనీ వెల్లడించింది. 32 కంటెయినర్లలో కమర్షియల్‌ ప్రోడక్ట్స్‌ తూర్పు జెజాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి 9,500 కిలోమీటర్ల దూరం 15 రోజుల్లో చేరుకుంది. కజకిస్తాన్‌, తుర్కెమినిస్తాన్‌ మీదుగా ఈ రైలు ప్రయాణించింది. సిల్క్‌ రోడ్‌, మార్గమధ్యంలో వున్న దేశాలకు ఎంతో మేలు చేస్తుందని అధికారులు వెల్లడించారు. సముద్రయానంతో పోల్చితే 30 రోజుల సమయం ఆదా అవుతుంది. టెహ్రాన్‌తో ఈ రైల్వే ప్రాజెక్ట్‌ ఆగిపోదనీ, దీన్ని యూరోప్‌కి కూడా విస్తరించే ఆలోచనలున్నాయని అధికారులు వెల్లడించారు. అవసరాన్ని బట్టి ఇంకా ఎక్కువగా ట్రైన్‌ ట్రిప్‌లను పెంచుతామని కూడా అధికారులు చెబుతున్నారు. చారిత్రాత్మకమైన, అతి పురాతనమైన వ్యాపార సంబంధాలను పునరుద్ధరించడంలో భాగంగా చైనా మరియు మెడిటేరియన్‌ సీ కనెక్టింగ్‌ కోసం రూపొందించిన ఈ రైలుకు చైనా సిల్క్‌ ట్రేడ్‌ని ప్రతిబింబించేలా 'సిల్క్‌ రోడ్‌'గా నామకరణం చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com