కిరణ్ కు ''రాష్ట్రీయ సమాజ్ సేవా రత్న'' పురస్కారం
- November 08, 2020
'మనం సైతం' సేవా సంస్థ ద్వారా పేదలను ఆదుకుంటున్నారు నటులు కాదంబరి కిరణ్. చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్ ల వారితో పాటు సంస్థ సాయం కోరిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తున్నారు. కాదంబరి చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ ఏడాది ''రాష్ట్రీయ సమాజ్ సేవా రత్న'' పురస్కారం దక్కింది. అక్టోబర్ 31న ప్రకటించిన ఈ అవార్డ్ ఆదివారం (నవంబర్ 8న) ఆయనకు చేరింది. ఢిల్లీ ప్రభుత్వ గుర్తింపు పొందిన 'ది గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్' వారు ఈ ''రాష్ట్రీయ సమాజ్ సేవా రత్న'' పురస్కారాన్ని కళలు, సామాజిక సేవ, వైద్య, వ్యాపారం వంటి రంగాల్లో ఏటా అందిస్తుంటారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి కాదంబరి కిరణ్ ను సేవా విభాగంలో ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ...మనం సైతం సేవా సంస్థ ద్వారా వేలాది మందికి సహాయం చేసే అదృష్టం నాకు దక్కింది. ఈ సేవా కార్యక్రమాలకు రాష్ట్రీయ సమాజ్ సేవా రత్న పురస్కారం దక్కడం నిజంగా ప్రోత్సాహకరం. నా సేవకు దొరికిన గుర్తింపుగా భావిస్తున్నాను. వినయంగా అవార్డును స్వీకరిస్తున్నాను. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా ఎక్కడైనా, ఎవరికైనా..మనం సైతం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నా. అన్నారు.
తాజా వార్తలు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!







