కరోనా ట్రీట్మెంట్ నిలిపేశారంటూ ప్రచారం..రూమర్స్ గా కొట్టి పారేసిన అధికారులు
- November 08, 2020
మస్కట్: ఒమన్ లోని కొన్ని ఆస్పత్రుల్లో కోవిడ్ 19 డిపార్ట్మెంట్ ను మూసివేశారని, ఇక కరోనా ట్రీట్మెంట్ చేయరంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వ సమాచార కేంద్రం కొట్టిపారేసింది. సుల్తానేట్ పరిధిలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా చికిత్సను పూర్తిగా నిలిపివేశారని, ఇక నుంచి కోవిడ్ వార్డులో పేషెంట్లను చేర్చుకోరంటూ ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రభుత్వ యంత్రాంగం వరకు వెళ్లటంతో కోవిడ్ ట్రీట్మెంట్ కు సంబంధించి ప్రభుత్వ సమాచార కేంద్రం స్పష్టతను ఇచ్చింది. సుల్తానేట్ పరిధిలో ట్రీట్మెంట్ నిలిపివేశారని చెబుతున్న ప్రచారంలో నిజం లేదని, మిగిలిన ఆస్పత్రుల తరహాలోనే ఆ ఆస్పత్రిలో కూడా కోవిడ్ పేషెంట్లను చేర్చుకొని చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







