మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్...
- November 09, 2020
హైదరాబాద్:ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎవరిని వదలడం లేదు. వారు వీరి అనే తేడా లేకుండా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక తాజాగా మెగాస్టార్ చిరవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా తెలిపారు. ''ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను'' అని ట్విట్ చేసారు మెగాస్టార్. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన ఆచార్య షూటింగ్ ఈ రోజు ప్రారంభం కావాల్సింది. కానీ ఇప్పుడు ఆగిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







