దుబాయ్:ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఫేస్ మాస్క్ నుంచి మినహాయింపు
- November 10, 2020
దుబాయ్:కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఫేస్ మాస్క్ తప్పనిసరి నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు దుబాయ్ అధికారులు వెల్లడించారు. ఫేస్ మాస్క్ నుంచి మినహాయింపు పొందాలనుకుంటున్న వారు అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని దుబాయ్ ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. దుబాయ్ పోలీసుల భాగస్వామ్యంతో ఈ డ్రైవ్ చేపట్టామని వివరించారు. ముఖ్యంగా ఫేస్ మాస్క్ ధరించటం వల్ల స్కీన్ అలర్జీ సమస్యను ఎదుర్కుంటున్న వారు, దీర్ఘకాలికంగా సైనటీస్ తో బాధపడుతున్నవారు, అస్తమా వ్యాధిగ్రస్తులు, నోరు, ముక్కు, చెవి సంబంధిత వ్యాధులు ఉన్నవారు మాస్కులు ధరించటం వల్ల ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితులు ఉన్నట్లు మెడికల్ రిపోర్టులు ఉంటే వారికి మాస్కులు తప్పనిసరి నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు అధికారులు వివరించారు. ఫేస్ మాస్క్ రూల్ నుంచి మినహాయింపు పొందాలనుకునే వారు..దుబాయ్ పోలీస్ వెబ్ సైట్ http://www.dxbpermit.gov.aeద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు మెడికల్ రిపోర్టును, ఎమిరాతి ఐడీని తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారిడి అప్లికేషన్ సహేతుకమని భావిస్తే వారికి మినహాయింపు ఇస్తామని, మినహాయింపు పొందిన వారు ఫేస్ మస్కులు ధరించాల్సిన అవసరం లేదని డీహెచ్ఏ వెల్లడించింది. అయితే..ఆరోగ్య సంరక్షణ కోసం పబ్లిక్ ప్రాంతాల్లో ఉండే సమయంలో వీలైనంత వరకు మాస్కులు ధరించటమే అందరికీ శ్రేయస్కరమని డీహెచ్ఏ తెలిపింది.
తాజా వార్తలు
- పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..
- పీ-8ఐ యుద్ధ విమానాల భారీ నిర్వహణ కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఒప్పందం
- తైవాన్ జోలికొస్తే యుద్ధమే.. ట్రంప్కు జిన్పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
- సీఎం విజయ్ మరో బిగ్ డెసిషన్..
- సముద్రంలో భారత నౌక జలసమాధి.. హైజాకర్ల చేతిలో మరో షిప్!
- ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్యం ఆదాకు ప్రజలు సహకరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- BRICS దేశాల విదేశాంగ మంత్రులతో భారత్ చర్చలు
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..వారానికి ఒక రోజు ‘నో వెహికిల్ డే’!
- ఛార్ధామ్ యాత్ర మొదలైన 26 రోజుల్లోనే 38 మంది భక్తులు మృతి
- సౌదీ అరేబియాలో 19 మందికి జరిమానాలు..!!









