ఒమన్:ఈ నెల 15 నుంచి మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి
- November 11, 2020
మస్కట్:8 నెలలుగా మసీదుల్లో ప్రార్ధనలకు దూరమైన భక్తులకు ఒమన్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 15 నుంచి మసీదుల్లో ప్రార్ధనలు చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ నేపథ్యంలో గత మార్చి నుంచే సామూహిక ప్రార్ధనలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే..జనజీవనం సాధారణ స్థితికి చేర్చటంలో భాగంగా పలు రంగాలకు అనుమతి ఇస్తూ వస్తున్న ఒమన్ ప్రభుత్వం...ఎట్టకేలకు మసీదుల్లో ప్రార్ధనలకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. మినిమం 400 మంది భక్తులు ప్రార్ధనలు చేసుకునే సామర్ధ్యం కలిగిన మసీదుల్లో భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే..కోవిడ్ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. భౌతిక దూరం పాటించటంతో పాటు..సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని, ఫేస్ మాస్కులు విధిగా ధరించాలని పేర్కొంది. రోజులో ప్రార్ధాన చేసే సమయంలో 25 నిమిషాల పాటే మసీదు తెరవబడి ఉంటుంది. అయితే..శుక్రవారాల్లో మాత్రం ఆంక్షలు యధావిధిగా కొనసాగుతాయి. ఇదిలాఉంటే..ఎట్టకేలకు మసీదుల్లో ప్రార్ధనలకు ప్రభుత్వం అనుమతివ్వటం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియా ద్వారా తమ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కోవిడ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!









