దుబ్బాక ప్రజలకు ప్రధాని మోడి ధన్యవాదాలు
- November 11, 2020
న్యూఢిల్లీ: దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయంపై ప్రధాని నరేంద్రమోడి మాట్లాడుతూ..ఈ విజయం చారిత్రాత్మకమన్నారు. బిజెపిని గెలిపించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బిజెపి గెలుపు కోసం కార్యకర్తలు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. రాష్ట్రాభివృద్ధిలో ఈ విజయం తమకు మరింత శక్తినిస్తుందని అన్నారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై బిజెపి అభ్యర్థి రఘునందన్రావు 1,079 ఓట్లతో విజయం సాధించారు. గెలిచిన రఘునందన్రావుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దుబ్బాకలో విజయం సాధించేందుకు కృషి చేసిన కార్యకర్తలు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు షా అభినందనలు తెలిపారు. టిఆర్ఎస్ అవినీతికి, రాచరిక పాలనకు వ్యతిరేకంగా ఈ ఫలితాలు వెలువడ్డాయని నడ్డా అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









