ఫ్రీ కూపన్లు అంటూ తప్పుడు ప్రచారం..కూపన్ల ప్రచారాన్ని కొట్టిపారేసిన లులు
- November 12, 2020_1605195834.jpg)
యూఏఈ:యూఏఈలోని ప్రముఖ రిటైల్ మార్కెట్... లులు గ్రూప్ ప్రజలకు 250 యూరో డాలర్ల ఉచిత కూపన్లు అందిస్తోన్న ప్రచారాన్ని చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ వి.నందకుమార్ కొట్టిపారేశారు. తాము ఎలాంటి కూపన్ ఆఫర్లు ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు. సర్వే పేరుతో కొందరు నకిలీగాళ్లు వినియోగదారులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని..అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు. సర్వే పేరుతో వినియోగదారుల అభిప్రయాలను తెలుసుకున్న తర్వాత..నెక్ట్స్ టార్గెట్ గా వాట్సాప్ లో ఐదు గ్రూపులకు గానీ, 20 మంది స్నేహితులకు లులు హైపర్ మార్కెట్ రిఫర్ చేయాలని షరతు విధిస్తారు. మెసేజ్ చేయగానే 250 యూరో డాలర్ల కూపన్ అందుతుందని, దాంతో హైపర్ మార్కెట్ లో షాపింగ్ చేయవచ్చని, ఆన్ లైన్ లో కూడా షాపింగ్ చేసే అప్షన్ ఉందని మోసగాళ్లు ప్రచారం చేస్తున్నారు. అయితే..తాము ఎవరికీ ఎలాంటి కూపన్లను ఆఫర్ చేయటం లేదని లులు ప్రకటించింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు