మనిషి కడుపులో 250 ఇనుప మేకులు...సౌదీలో అరుదైన ఆపరేషన్
- November 13, 2020
రియాద్:సౌదీ అరేబియాలో అరుదైన ఆపరేషన్ జరిగింది. ఓ మనిషి కడుపులో నుంచి 250 ఇనుప మేకులు..గాజు ముక్కలను తొలగించారు డాక్టర్లు. సకాలంలో గుర్తించి వాటిని తొలగించటంతో ప్రాణాపాయం తప్పంది. అయితే..బాధితుడికి మానసిక స్థితి సరిగ్గా లేదని..ఈ కారణంగానే అతను ఇనుప మేకులు, గాజు ముక్కలను మింగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇనుప మేకులను మింగటంతో అతనికి పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వచ్చినట్లు..ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చినట్లు వైద్యులు వివరించారు. స్కాన్ చేసి పరీక్షించిన వైద్యలు కడుపులో కుప్పలుగా ఉన్న ఇనుప మేకులను చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే ఆపరేషన్ నిర్వహించి మేకులను, గాజు ముక్కలను తొలగించటంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. అయితే..అతని మానసిక స్థితి బాగలేదని, సైక్రియాట్రిక్ ట్రీట్మెంట్ అవసరమని వైద్యులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







